మేడారం హుండీల లెక్కింపు.. రూ.10.32 కోట్ల ఆదాయం

591చూసినవారు
మేడారం హుండీల లెక్కింపు.. రూ.10.32 కోట్ల ఆదాయం
మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో కొనసాగుతోంది. 4వ రోజు ఆదివారం 88 హుండీల తెరిచి లెక్కించగా రూ.71.67 లక్షల ఆదాయం వచ్చినట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. మొత్తం 518 హుండీల్లో ఇప్పటివరకు 405 హుండీలు తెరిచి లెక్కించామని, మొత్తం రూ.10,32,03,000 ఆదాయం వచ్చినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :