టీడీపీ సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే 94 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాలో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా మంది సీనియర్లకు మొండి చెయ్యి చూపించారు. వారిని కాదని కొత్త వాళ్లకు అవకాశమిచ్చారు. దాంతో తర్వాతి జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.