ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్కు ఈ నెల 19 వరకు, సెకండియర్కు 20వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఉదయం 8:45లోపు పరీక్షా కేంద్రంలో ఉండాలి. హాల్ టికెట్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదు.