ఏపీ ప్రజలకు వాతవరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన
ి వెల్లడించింది. ఈ నెల 7న శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుందని పేర్కొంది.