ఖాళీలు ఉంటే ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్స్ జారీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తయితే జీరో వెకెన్సీ అవుతుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 6,100 ఖాళీలు మాత్రమే ఉన్నాయని, పార్లమెంట్లో చెప్పిన ఖాళీల విషయం సత్యదూరమని అన్నారు. ఒక వేళ ఖాళీలు ఉంటే నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.