గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జనసేన పార్టీ నాయకుని ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ద్వారా అక్షరాల 2 లక్షల 79 వేల రూపాయలు అందించడం జరిగింది అని తెలియజేశారు. ఆ కుటుంబం జగనన్న ప్రభుత్వ తీరుపై హర్షం వ్యక్తం చేశారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జనసేన నాయకుడిని అయినప్పటికీ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ కి మా కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు.