
కొండాపురంలో ముస్లింలకు షాది ఖానా నిర్మిస్తాం: భూపేష్ రెడ్డి
కొండాపురంలో జమ్మలమడుగు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, మండలం బీజేపీ ఇన్ఛార్జ్ శివానారాయణ రెడ్డి మంగళవారం పర్యటించారు. పట్టణంలోని సున్ని హనఫియా మస్జీద్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు షాది ఖానా, మస్జిద్ కాంపౌండ్ నిర్మించాలని భూపేష్ రెడ్డిని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా మంజూరు చేయిస్తానని ముస్లింలకు ఆయన హామీ ఇచ్చారు.