వైసీపీ త్వరలో భూస్థాపితం అవుతుందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. "వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారు. అయితే వారిని మా పార్టీలో చేర్చుకోం. వైఎస్ జగన్ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా ఓ కారణం. రాజధానిని తరలించాలనుకున్న జగన్కు ప్రజలు బుద్ధి చెప్పారు." అని ఆయన విమర్శించారు.