ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి

76చూసినవారు
ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగులో ఉన్న జడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , సరెండర్ లీవ్, మెడికల్ రీయంబర్స్మెంట్ వంటి బకాయిలను చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ బాషా, సంగమేశ్వరరెడ్డిలు డిమాండు చేశారు. మంగళవారం మైదుకూరు ఎంఈవో కార్యాలయ ఆవరణంలో రీజనల్ కన్వీనర్ కె. వెంకటేశ్వర రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్