బీజేపీ, వైసీపీ వలన రైతుల ఆత్మహత్యలు పెరిగాయి

584చూసినవారు
ఏపీలో రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏపీ మీడియా చైర్ మెన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు 5 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు.