కుంగిన భూమిని పరిశీలించిన వైవీయూ విద్యార్థులు

55చూసినవారు
కుంగిన భూమిని పరిశీలించిన వైవీయూ విద్యార్థులు
యోగి వేమన విశ్వవిద్యాలయం జియాలజీ, ఎర్త్ సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు దువ్వూరు మండలం రామాపురం వ్యవసాయ భూమిని శుక్రవారం సందర్శించారు. రైతు మానుకొండ వెంకట శివ వ్యవసాయ భూమిలో సుమారుగా 15 అడుగుల లోతు మేర భూమి కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. సున్నపు రాతి పొరలు భూగర్భంలో జరిపిన చర్య ఫలితంగా భూమి కుంగిపోయిందని గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్