
కళాశాల వద్ద బస్షెల్టర్ నిర్మించండి
వేముల మండల కేంద్రమైన వేములలోని కళాశాలల వద్ద బస్షెల్టర్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. వేములలోని ప్రభుత్వ ఐటీఐ, జూనియర్ కళాశాలలకు తదితర గ్రామాల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు చదువుకునేదుకు వస్తుంటారు. అయితే వీరు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచిఉండే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి బస్షెల్టర్ నిర్మించి రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.