తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ఫ్లూయెంజా (హెచ్5ఎన్1 -బర్డ్ ఫ్లూ) వైరస్ కారణమని తేలింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం, తణుకు మండలం వేల్పూరులోని ఫారాల నుంచి రెండు నమూనాలను భోపాల్లో ఉన్న ఐసీఏఆర్-ఎన్ఐహెచ్ఎస్ఏడీకు పంపించారు. అక్కడ పాజిటివ్గా నిర్ధారించారు. తెలంగాణ నుంచి పంపిన నమూనాల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి.