150 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీలోకి చేరిక
వీరపునాయునిపల్లి మండలం మొయిళ్ళచెరువుకు చెందిన టిడిపి కార్యకర్తలు 150 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. గురువారం ఉదయం మొయిళ్ల చెరువు గ్రామంలో సాయినాథ్ శర్మ వర్గీయులు దాదాపు 150 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సాయినాథ్ శర్మ వర్గీయులకు పార్టీ అండగా ఉంటుందని ఎంపీ, ఎమ్మెల్యే భరోసా కల్పించారు.