AP: పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయగూడెం (M) కుక్కనూరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఆమె దగ్గర అజిత్ కుమార్ అనే వ్యక్తి రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించమని కోరగా, రాత్రివేళ ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.