శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

85చూసినవారు
సామర్లకోట అయోధ్య రామపురం సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు శుక్రవారం అంకురార్పణ చేశారు. పోలినాటి సూర్యచందర్రావు విజయలక్ష్మి దంపతులు యజ్ఞకర్తలుగా చీమల కొండ ప్రసాద్ ఆధ్వర్యంలో రానున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు పందిరి రాట వేసి, గణపతి పూజ చేశారు. నేతలు బడుగు శ్రీకాంత్, తాతపూడి అరుణవంశి, ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.