May 20, 2024, 15:05 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి
May 20, 2024, 15:05 IST
కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ కుమార్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హోటల్లు సూపర్ మార్కెట్ కిరాణా షాపులు తనిఖీలు చేశారు. రసాయనలతో తయారుచేసిన పదార్థాల శాంపిల్లు సేకరించి ల్యాబ్ కు తరలించారు. రసాయనాలతో తయారుచేసిన పదార్థాలు అమ్మినవారికి జరిమానాలు విధించారు.