పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలంలో సురక్ష ప్యాలస్ వద్ద శనివారం వైఎస్సార్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు హాజరయ్యారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 1620 డ్వాక్రా సంఘాలకు 16200 లబ్దిదారులకు 13కోట్ల 18లక్షలు అందించడం జరిగిందన్నారు. మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.