ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని ఏలేశ్వరం డిపో మేనేజర్ జి. వి. సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గాను శుక్రవారం ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులు సూచనలు, సలహాలు 9959225532లో తెలియజేయాలన్నారు.