
ప్రతిపాడు: బైకుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి
బైకు పై వెళుతున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నాగులపాడు గ్రామానికి చెందిన మేలిమి రమేష్ బైకు పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అడ్డగించి దాడి చేశారు. స్పృహ కోల్పోయిన రమేష్ ను స్థానికులు ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు సోమవారం పెదనందిపాడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారిస్తున్నారు.