శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని అన్నారు.