కోనసీమలో 68 పశువైద్య శిబిరాలు

62చూసినవారు
కోనసీమలో 68 పశువైద్య శిబిరాలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో 68 పశు వైద్య ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె. వెంకట్రావు బుధవారం వెల్లడించారు. పశువులకు దొమ్మ వ్యాధి రాకుండా 27 వేల పశువులకు టీకాలు వేశామన్నారు. ఆయన పి. గన్నవరం మండలం బూరుగులంక, పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట గ్రామాల్లోని వైద్య శిబిరాల్లో పశువులకు పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్