తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు స్థానిక మేడలైను వద్ద హెలికాప్టర్ దిగి నడకుదురు కుసుమ సత్య ఫంక్షన్ హాలు చేరుకుంటారు. అక్కడి నుండి అన్నమ్మ ఘాటీ, జగన్నాథపురం బ్రిడ్జి మీదుగా రోడ్డు షో చేపట్టి సినిమా రోడ్డులోని సంతచెరువు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.