ఘనంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు

77చూసినవారు
ఘనంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో వేంచేసి ఉన్న కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో యువ నాయకుడు బండారు సంజీవ్, వంటిపల్లి పాపారావు, తాడి శ్రీనివాసరెడ్డి (బట్టీ శ్రీను), గొడవర్తి దుర్గాప్రసాద్ (బాబీ )పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.