మావుళ్ళమ్మను దర్శించుకున్న లీలాకృష్ణ

50చూసినవారు
మండపేట మండలం మారేడుబాకలో వేంచేసియున్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి తీర్ధ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్