రైతులకు సకాలంలో సాగు నీరు అందించాలి

1062చూసినవారు
వ్యవసాయం చేసుకునే రైతన్నలకు సకాలంలో సాగునీరును అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు అన్నారు. మలికిపురం మండలం పరిధిలోని లక్కవరంలో శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ. రైతులకు సాగు చేసుకోవడానికి నీటిని ఆలస్యంగా విడుదల చేయడంతో వారు సమయానికి పంటలు వేసుకోలేకపోతున్నారన్నారు. గతంలో మాదిరి మే నెలలో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్