మలికిపురం: తోటి మిత్రుడికి రూ. 40 వేల సహాయం
1988-89లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమతో చదువుకున్న స్నేహితుడి ఇంటి నిర్మాణానికి ఆదివారం రూ. 40 వేల ఆర్థిక సహాయం అందించారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా స్పందించిన పూర్వ విద్యార్థులు మలికిపురానికి చెందిన షరీఫ్ కు ఈ సహాయం అందజేశారు. లండన్ లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్, కువైట్ లో ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్, ఆనందరావు స్థానిక స్నేహితుల ద్వారా ఈ మొత్తాన్ని అందజేశారు.