

మలికిపురం: ఉగాది అందరి జీవితంలో వెలుగులు నింపాలి
మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంటి వద్ద ఉగాది సందర్భంగా ఆదివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరికీ శ్రీవిశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఉగాది వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారని చెప్పారు. కూటమి నేతలు పాల్గొన్నారు.