తాను గెలిచాక అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి అన్నారు. మంగళవారం రాత్రి అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగిన ప్రజా సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి కొరత ఎక్కువైందని తెలిపారు. తాను ఎంపీగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో సాగునీటి కొరత లేకుండా చూస్తానని, రహదారుల నిర్మాణానికి అధిక నిధులు తీసుకొస్తానన్నారు.