రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

72చూసినవారు
మోపిదేవి - విజయవాడ కరకట్ట పై
నడకూదురు దగ్గరలో రోడ్డు ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది. ముఖం అంతా గాయాలు అయి తీవ్ర రక్త స్రావం అయింది. బాధితుడు బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఉప్పుడి గ్రామానికి చెందిన కుంభా నాంచారయ్యగా గుర్తించారు. గ్రామాల్లో మల్లెపూలు అమ్ముకునీ జీవనం సాగిస్తూ ఉంటాడు. మోపిదేవి 108లో అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేసారు.