అవనిగడ్డ నియోజకవర్గంలో నూతన ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్ ఘన విజయం సాధించిన సందర్భంగా మోపిదేవి మండల రేషన్ డీలర్లు మంగళవారం అవనిగడ్డలో బుద్ధప్రసాద్, తనయుడు మండలి వెంకట్రామ్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు తమ సమస్యలను మండలి బుద్ధప్రసాద్ కు తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి మీ సమస్యలు తీసుకువెళ్తానని బుద్ధ ప్రసాద్ తెలిపారు.