నాగాయలంక మండలం భావదేవరపల్లిలోని ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్
నోటిఫికేషన్ విడుదలైంది. పదవ పాసైన అభ్యర్థులు https: //apfu. ap. gov. in/ అధికారిక వెబ్ సైట్ లో ఈ నెల 10 నుంచి 26లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రశేఖరరావు మంగళవారం తెలిపారు. అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించమని, పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చని ఆయన స్పష్టం చేశారు.