కృష్ణాజిల్లా మచిలీపట్నంలో టిడిపి పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో సర్దార్ గౌత లచ్చన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేసి ప్రజలకు ప్రభుత్వం ద్వారా రావలసిన సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు.