భక్తులతో పోటెత్తిన స్వామివారి ఆలయం

51చూసినవారు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. తొలుత నాగ పుట్ట వద్ద పాలు పోసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో చక్రధరరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్