రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి

78చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం భూగర్భ జలవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కాపు కులానికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల కులాల అభ్యున్నతికి, సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి రంగా అని కొనియాడారు. ఆయన పేద ప్రజలకు చేసిన సేవ మరువలేనిదని తెలిపారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్