పెనమలూరు నియోజకవర్గం పరిధిలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు, కాలువలు ఏకమై పొంగి పొర్లడంతో పాటు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.