స్వతంత్ర సమరయోధులు తిలక్, ఆజాద్ లకు నివాళి

75చూసినవారు
స్వతంత్ర సమరయోధులు తిలక్, ఆజాద్ లకు నివాళి
గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులు బాలగంగాధర తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఇరువురి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలువురికి ఆదర్శంగా నిలిచారని సాయిబాబా సేవా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి చిన్నారులకు రంగు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్