విజయవాడలోని విద్యాధరపురం లేబర్ కాలనీకి చెందిన వేముల శ్రీదేవి పుట్టుకతో వికలాంగురాలు. తన రెండు కాళ్లు పనిచేయవు. తన భర్త ఏదో పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు అతను మరణించాడు. అప్పటినుండి వికలాంగుల సర్టిఫికెట్ కోసం తిరిగినా పట్టించుకోవటం లేదని ఆదివారం మీడియాతో తమ ఆవేదాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్టిఫికెట్ ఇప్పించి ఆదుకోగలరని పేద విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.