May 02, 2024, 02:05 IST/చొప్పదండి
చొప్పదండి
రేణుక ఎల్లమ్మ సిద్దోగంలో మాజీ ఎమ్మెల్యే
May 02, 2024, 02:05 IST
బోయినపల్లి మండలం వరదవెల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్దోగం మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.