సి. బెళగల్ మండల కేంద్రమైన సి. బెళగల్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. మండల కేంద్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడారు. కర్నూలు లోక్సభ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు అభ్యర్థిగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.