సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు పుట్టినరోజు రోజు సందర్భంగా సోమవారం హిందూపురంలో ఆదోని అభిమాన సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదోనిలో ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు ఆదోని ఇంచార్జి మీనాక్షినాయుడు, అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదలు తెలిపారు. సంఘం అధ్యక్షులు ఎన్ సజ్జాద్ హుస్సేన్ బాలయ్య బాబుకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.