నంద్యాల జిల్లాలో బోనులో చిక్కిన చిరుత

2946చూసినవారు
నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండలం పచ్చర్ల చెక్ పోస్టు దగ్గర బోనులో చిరుత శుక్రవారం తెల్లవారుజామున చిక్కింది. చిరుతను తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. నెల రోజులుగా పచ్చర్ల పరిసరాల్లో మనషుల పై చిరుత దాడి చేస్తుంది. చిరుతను బంధించడానికి అధికారులు అహర్నిశలు కృషి చేశారు. మేకను ఎరగా వేసి చిరుతను అధికారులు బోనులో బంధించారు. చిరుత పట్టుబడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్