శివపురంలో వైభవంగా రథసప్తమి వేడుకలు

73చూసినవారు
అవుకు మండలంలోని శివపురం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహించి, ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్