అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తాం

73చూసినవారు
డోన్ నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన విషయం విదితమే ఈ సందర్భంగా ప్యాపిలి మండలంలోని తెదేపా నాయకులు ఆదివారం కోట్లను కర్నూలులోని ఆయన స్వగృహంలో కలిశారు. పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరవేసేందుకు తమ వంతు కృషి చేస్తామని కోట్ల పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, గోపాల్, కలచట్ల ప్రసాద్, భాస్కర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్