శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ను ప్రకటించడంతో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తిప్పేస్వామి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. సునీల్ కుమార్కు బీఫామ్ ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, ఆలోపు ఏదైనా జరగవచ్చని తిప్పేస్వామి వ్యాఖ్యానించారు.