కోడుమూరు, గూడూరులో ముగిసిన మొహర్రం వేడుకలు

84చూసినవారు
కోడుమూరు, గూడూరు మండలాల్లో మొహర్రం వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు పీర్లను ఊరేగింపుగా ఏటికి తరలించారు. మండలంలోని గుడిపాడు, పెంచికలపాడు, కె. నాగులాపురం, బూడిదపాడు, చనుగొండ్ల, కోడుమూరు గ్రామాల్లో మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు, కోడుమూరు ఎస్సైలు హనుమంతయ్య, బాల నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చావిడిల నుంచి పీర్లను నిమజ్జనానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్