ఉపాధ్యాయుడు మా స్కూల్ కు వద్దంటూ గ్రామస్తులు ధర్నా

82చూసినవారు
సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు మా స్కూల్ కు వద్దంటూ శుక్రవారం కోడుమూరు ఎంఈవో కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి బైన్ దొడ్డి గ్రామస్తులు ధర్నా చేశారు. గ్రామస్తులతో పాటు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మాట్లాడారు. బైదొడ్డి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయునులు ఏడాదిగా సక్రమంగా పనిచేస్తున్నారని, అనవసరంగా బదిలీ చేయాల్సిన అవసరం ఎంఈవోకు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్