రేవనూరులో బీసీ ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం
కోవెలకుంట్ల మండలంలోని టీడీపీ మహిళా నాయకురాలు బీసీ ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం మండలంలో కలుగొట్ల, జొలదరాసి, రేవనూరు గ్రామాల్లో బీసీ ఇందిరమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. సీఎం జగన్ పాలనలో దేశానికి అన్నంపెట్టే అన్నదాతలను నయవంచన చేశారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.