ఈ సమస్త చరాచర జగత్తును సృష్టించి, లయము చేయు విశ్వ నియమ ప్రవర్తకుడు పరమాత్మ అని, ఆయనను తెలుసుకుని జీవించుటయే మానవ జీవిత పరమార్ధమని ప్రముఖ వ్యాఖ్యాత, సంస్కృత పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు శనివారం అన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రఛారం ఆధ్వర్యంలో నంద్యాల మండలం, బిల్లలాపురం గ్రామంలోని శివాలయం నందు ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.