ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా

1519చూసినవారు
పత్తికొండలో నాలుగు స్తంభాల మంటపం వద్ద ఎమ్మార్పీఎస్, దళిత సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని బుధవారం రాత్రి 7 గంటలకు నిర్వహించారు. ఆర్డీవో మద్దికెర తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. మండల కేంద్రమైన మద్దికెరలో దళితులకు ఇళ్ల పట్టాల విషయంలో తీరని అన్యాయం జరిగిందని దళిత సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకులు తిరుపాల్, వెంకటేష్, పులికొండ, సాలు రంగడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :