
ఆత్మకూరు: వేటగాళ్ల వేటు కు కణుతులు, నెమలి మూగ జీవులు మృతి
నంద్యాల జిల్లా, ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి (మం) గుమ్మడాపురం బీట్ లో వేటగాళ్ళు విద్యుత్ వైర్లతో వేసిన ఉచ్చులో పడి 2 కణతులు మృతి చెందాగా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామ సమీపంలో ఓ నెమలి అనుమానస్పదంగా మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో ముగ్గురు వేటగాళ్లు పరారు కాగా మరో అనుమానస్పద వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ అధికారులు విచారణ చేస్తున్నారు.